Take a fresh look at your lifestyle.

విజయవంతంగా కొనసాగుతున్న ఫీవర్ సర్వే

ఆర్థిక,ఆరోగ్య శాఖ మంత్రి హరీష రావు

ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సంఘం డైరీని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కోకపేట్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, సెక్రెటరీ బలరాం యాదవ్, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాళ్ళ సంఘం అధ్యక్షులు కే ఎస్ రామారావు, జనరల్ సెక్రెటరీ కళింగ కృష్ణ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి తడితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కొరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని, రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో జ్వర సర్వే విజయవంతంగా కొనసాగుతున్నదని, లక్షణాలు ఉన్నవారికి కిట్లు అందిస్తున్నట్లు అన్నారు.

Leave a Reply