- 36,300 కోట్ల పెట్టుబడులు
- స్వాగతించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 20 : ప్రముఖ ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెంచుతున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి రూ. 36,300 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏడబ్ల్యూఎస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్లో అమెజాన్ ప్రకటించింది. ప్రకటనను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు.
ఏడబ్ల్యూఎస్ ప్రకటన సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. తెలంగాణ పౌరులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇ-గవర్నెన్స్, హెల్త్కేర్, పురపాలక కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు ఈ డేటా సెంటర్లను ఉపయోగిస్తామన్నారు. ఈ డేటా సెంటర్తో దేశంలోనే ప్రగతిశీల డేటా సెంటర్ హబ్గా తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని చందన్వెల్లి, ఎఫ్ఏబీ సిటీ, ఫార్మా సిటీల్లోని డేటా సెంటర్లలో దశల వారీగా పెట్టుబడులు పెట్టనుంది.