Take a fresh look at your lifestyle.

బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలకు వోటు వేసి వృథా చేసుకోవద్దు

కాంగ్రెస్‌ ‌నాయకులు గ్రామాలకు వొస్తే 6 గ్యారెంటీలపై నిలదీయండి
:ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే పైలట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29: ‌బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలకు వోటు వేసి వృథా చేసుకో వద్దని, కాంగ్రెస్‌ ‌నాయకులు గ్రామాలకు వొస్తే ఆరు గ్యారెంటీ లపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా సోమవారం చేవెళ్ల టిఆర్‌ఎస్‌ ఎం‌పీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ ‌కు మద్దతుగా తాండూరు నియోజకవర్గంలో బషీరాబాద్‌ ‌మండల కేంద్రంలోని పైలెట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి  బషీరాబాద్‌ ‌మండల పరిధిలోని నీళపల్లి, మైల్వార్‌ ‌గ్రామాల్లో స్ట్రీట్‌ ‌కార్నర్‌ ‌మీటింగ్స్ ‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ  కాంగ్రెస్‌ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వొచ్చిందని, కాంగ్రెస్‌ ‌పార్టీ చెప్పిన మోసపూరిత హామీలను ప్రజలు గమనించాలని అన్నారు.

తెలిసి తెలియక చీకటి రోజులు తెచ్చుకున్నమని, భవిష్యత్‌ ‌తరాలను ద్రుష్టిలో పెట్టుకొని కారు గుర్తుకు వోటు వేయాలని కోరారు. కేసీఆర్‌ ‌పథకాలు అందని ఇల్లు లేదని, కేసీఆర్‌ ‌పోంగనే కరెంట్‌ ‌కష్టాలు మొదలు, కనీసం ఇంటి ఇంటికి తాగునీరు ఇవ్వడం చేతకానిది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాని కాంగ్రెస్‌ ‌నాయకులు గ్రామాలకు వొస్తే 6 గ్యారెంటీల పై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. కొండా ఎవరిని దగ్గరకు కూడా రానియడని, తాండూరులో పదిమందిని కూడా గుర్తు పట్టడని, కొండాను కలవాలంటే ప్రజలకు కొండంత కష్టం అని అన్నారు.  తాండూరుకు రమ్మని పిలిచినా రాని రంజిత్‌ ‌రెడ్డి ఇప్పుడు వొస్తున్నాడని, బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలకు వోటు వేసి వృథా చేసుకోవద్దని అన్నారు. ఎన్నికల ప్రచార లో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్‌ ‌రాజు గౌడ్‌ ‌బషీరాబాద్‌ ‌నాయకులు నర్సిరెడ్డి పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply