Take a fresh look at your lifestyle.

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వలంటీర్‌

‌కానూరు వలంటీర్‌కు సిఎం జగన్‌ ‌సాయం
తక్షణ సాయంగా రూ.2లక్షల ఆర్థిక సాయం
సిఎం హాతో వెంటనే అందచేసిన కలెక్టర్‌

విజయవాడ,మే19 : ఎన్టీఆర్‌ ‌జిల్లా కానూరు గ్రామా సచివాలయం పరిధిలో వాలంటీర్‌ ‌గా పనిచేస్తూ  దళిత సామాజిక వర్గానికి  చెందిన జక్కుల సోంబాబు వాలంటీర్‌గా బాధ్యతలు చేపట్టే నాటికే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి పై ఉన్న అభిమానంతో వాలంటీర్‌గా సేవలందించేందుకు బాధ్యతలు చేపట్టారు. కానీ అతనికి రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. డయాలసిస్‌ ‌చేయించుకోకపోతే జీవించలేని పరిస్థితి. శుక్రవారం వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొని సభ ముగించుకొని బయలుదేరిన ముఖ్యమంత్రిని సోంబాబు తన తల్లి, సోదరుడితో కలిసి  తన ఆవేదన, వాలంటీరుగా మరింత కాలం సేవలందించాలనే సంకల్పాన్ని గురించి వివరించారు.   సోంబాబు దీనగాధను విన్న ముఖ్యమంత్రి వైయస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డి చలించి పోయారు.వెంటనే ఎన్టీఆర్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌ఢిల్లీ రావుని పిలిచి సోంబాబుకు తక్షణసాయంగా రెండు లక్షల రూపాయలు అందించాలని ఆదేశించారు. ఈ సాయంతో పాటుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. యాలసిస్‌ ‌పేషెంట్లకు ప్రభుత్వం ఇస్తున్న పదివేల రూపాయల పెన్షన్‌ ‌కూడా అందించాలని అధికారులను ఆదేశించారు.

వీటితోపాటుగా మూత్రపిండాల మార్పిడికి అవసరమైన ఆన్‌లైన్‌ ‌రిజిస్టేష్రన్‌ ‌కూడా తక్షణమే పూర్తిచేయాలని చెప్పారు. మూత్రపిండాల మార్పిడికి అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని సోంబాబు కుటుంబానికి హా ఇచ్చారు. ముఖ్యమంత్రి చేసిన ఈ సహాయం తన జీవితంలో మర్చిపోలేనని సోంబాబు తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. తన ప్రభుత్వంలో వాలంటీర్లకు ఎటువంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని జగన్‌ ‌ప్రకటించారు. ముఖ్యమంత్రి వైయస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డి ఒక సాధారణ వాలంటీర్‌ ‌కు ఇచ్చిన హాని తక్షణమే ఎన్టీఆర్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌ఢిల్లీ రావు అమలు చేసి చూపించారు.  వాలంటీర్లకు వందనం సభలో కానూరు మురళి నగర్‌కు చెందిన వాలంటీర్‌ ‌కు జక్కుల సోంబాబుకు తక్షణ ఆర్ధిక సహాయం ప్రకటించిన రెండు లక్షల  రూపాయలు ఆర్ధిక సహాయాన్ని సభ ముగిసిన గంటలోపే ఎన్టీఆర్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌సోంబాబు కుటుంబానికి తన కార్యాలయంలో అందజేసి ముఖ్యమంత్రి హాని నెరవేర్చారు. సహాయం ప్రకటించిన గంట వ్యవధిలో బాధితునికి సాంత్వన కలిగేలా జిల్లా అధికార యంత్రాంగం వేగంగా స్పందించడం విశేషం.

చెక్కు అందజేసిన అనంతరం జిల్లా కలెక్టర్‌ ‌ఢిల్లీరావు మాట్లాడుతూ  ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణమే రెండు లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు.  ఇతర సహాయాలను  కృష్ణా జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయం అమలు చేస్తుందని తమ కార్యాలయం సిబ్బంది ఎప్పటికప్పుడు ఆర్ధిక సహాయం అందిచటంలో పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు.  ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో  ముఖ్యమంత్రి  మానవత్వానికి  నేటి సంఘటన నిదర్శనమన్నారు.  ఎన్టీఆర్‌ ‌జిల్లాలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద, బలహీన వర్గాలకు  చెందిన వారి సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం నిర్విరామం గా కృషి చేస్తోందని అన్నారు. అపరిష్క•త సమస్యలన్నీ జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చినంత వరకు సకాలంలోనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. సమస్యల పట్ల ఇంత వేగంగా స్పందించి,మానవత్వంతో ఆలోచించే ప్రభుత్వం ఉండటం అరుదైన విషయమని జిల్లా కలెక్టర్‌ ‌ఢిల్లీరావు అన్నారు. జిల్లా కలెక్టర్‌ ‌నుండి ఆర్ధిక సహాయం చెక్కును స్వీకరించిన వాలంటీర్‌ ‌జక్కుల సోంబాబుతో పాటు ఆయన మాతృమూర్తి జక్కుల వెంకమ్మ, సోదరులు జక్కుల జనార్దన్‌, ‌జక్కుల నవీన్‌లు ఉన్నారు.

Leave a Reply