Take a fresh look at your lifestyle.

మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ(ఆర్‌కె) అనారోగ్యంతో మృతి

2004 శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించిన ఆర్‌కె

మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్‌కె బస్తర్‌ ‌జిల్లా బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో అనారోగ్యంతో మృతి చెందినట్లు చత్తీస్‌ఘడ్‌ ‌డిజిపి అధికారికంగా ప్రకటించారు. ఆయన అప్పటి ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైయస్‌ ‌రాజశేఖర రెడ్డి కాలంలో 2004 సెప్టెంబర్‌లో శాంతి చర్చల కోసం వొచ్చిన అగ్ర నేత. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని జరిగిన చర్చిలో రామకృష్ణ కీలకపాత్ర పోషించారు.

4 సంవత్సరాల క్రితం బలిమెలలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆర్కేకు గాయాలు కాగా అతని కుమారునితో పాటు అనేక మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనలో తప్పించుకున్న ఆర్‌కే అప్పటి నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆర్కేపై 20 లక్షల రివార్డు ఉంది. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్‌ ఇన్చార్జిగా ఆయన కొనసాగుతున్నారు.ఆర్కే సొంత స్థలం గుంటూరు జిల్లా తుమ్మూరు కోట. ఆర్‌కె భార్య పద్మ మావోయిస్టు ఉద్యమం నుంచి నుంచి లొంగిపోయి ప్రకాశం జిల్లాలో తన ఇంటి వద్ద ఉంటున్నారు. కాగా ఆర్కే మృతిపై మావోయిస్టుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వారు చేసిన ప్రకటనపై స్పష్టత రానుంది.

Leave a Reply