- వరంగల్ కమిషనరేట్ దృష్టికి తీసుకెళ్లిన బాధితురాలు
- విచారణ జరుపనున్న పోలీస్ ఉన్నతాధికారులు
మరిపెడ మండల పరిధిలో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ ట్రైనీ ఎస్సైపై అదే మండలంలో ఎస్సైగా పని చేస్తున్న ఎస్సై లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపిస్తుంది. మంగళవారం పలు సామాజిక మాధ్యమాలు, ప్రసారమధ్యమాల ద్వారా విషయం బహిర్గతం కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని బాధితురాలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ దృష్టికి తీసుకెళ్లింది. ఎస్సై శ్రీనివాసరెడ్డి గత కొన్ని నెలలుగా మరిపెడ స్టేషన్ హౌస్ హెడ్గా విధులు నిర్వహిస్తున్న అతనిపై ఎలాంటి వివాదస్పద అంశాలు లేవని పోలీస్ వర్గాలతో పాటు పలువురు అంటున్నారు.
సిన్సియర్గా పనులు చేసినందుకు అతనిపై లేనిపోని నిందారోపణలు చేస్తున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. బాధితురాలు దళిత వర్గానికి చెందిన యువతి కావడంతో ఎస్సై ట్రైనీ ఎస్సైపై అఘాయిత్యానికి పూనుకున్నట్లు దళిత వర్గాలు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. న్యాయం జరగని యెడల తను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని ట్రైనీ ఎస్సై సామాజిక మాధ్యమాల ద్వారా హెచ్చరిస్తున్నట్లు పోస్టులు వొస్తున్నాయి. పూర్తి వివరాలు పోలీస్ ఉన్నతాధికారుల విచారణలో తేలనుంది.