ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్రావు
విజయ దశమి(దసరా) పర్వదినం సందర్భంగా జిల్లా, రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలందరికీ అన్నింటా శుభం చేకూరాలనీ, తెలంగాణా ప్రజల జీవితంలో దసరాను మించిన పండుగ లేదనీ, దసరా పండుగలో మన సాంప్రదాయం, సంస్కృతితో పాటూ ఆత్మీయత ఉందన్నారు. ఈ పర్వదినాన్ని ప్రజలందురూ సుఖసంతోషాలతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తునన్నారు.
చెడు మీద మంచి విజయం సాధించే రోజు విజయ దశమి అని పాలపిట్టను చూస్తే శుభం కలిగినట్టే తెలంగాణా ప్రజలకు శుభం కలగాలన్నారు. సిఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో దేశంలోనే అత్యంత వేగంగా పురోగతి సాధిస్తుందని చెప్పారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం అన్నింటా మరిన్ని విజయాలు సాధించాలని ఈ పర్వదినాన ఆ దుర్గ అమ్మవారిని వేడుకుంటున్నాననీ, దసరా పండుగ ప్రజలకు మరిన్ని విజయాలు అందించాలని కోరుకుంటున్నానీ అన్నారు.