- హైకోర్టులో పిటిషన్పై విచారణ 25కు వాయిదా
- ప్లాన్కు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళన
హైదరాబాద్, జనవరి 11(ఆర్ఎన్ఎ) : కామారెడ్డి టౌన్ మాస్టర్ ప్లాన్పై హైకోర్టు స్టేకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ 40 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ను ప్రతివాదులుగా తేల్చారు. పిటిషన్ను విచారించిన హైకోర్ట్.. కామారెడ్డి టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏవి• కాదని తెలిపింది. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ విషయంలో ఏళ్లతరబడి ఊగిసలాట కొనసాగుతుందని..అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేదని అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా రైతుల నుంచి అభ్యంతరాలు తీసుకుంటున్నామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇక మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా బుధవారం మున్సిపల్ ఆఫీసు ఎదుట రైతు ఐక్య కార్యచరణ కమిటీ ధర్నాకు దిగింది . అభ్యంతరాల స్వీకరణకు గడువు బుధవారం చివరి రోజు ఉన్న దృష్ట్యా రైతులు ధర్నా చేస్తున్నారు. కామారెడ్డి కొత్త టౌన్ ప్లానింగ్ పై గత కొన్ని రోజులు రైతులు ఆందోళన చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు రావడంతో పాటు, దానిని మార్చాలని డిమాండ్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే 1,026 అభ్యంతరాలు వచ్చాయి. ఇంకా కూడా వచ్చే అవకాశముంది. ఆయా గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు మున్సిపాల్టీతోపాటు, కలెక్టర్కు అభ్యంతరాలు ఇచ్చారు.
ప్లాన్కు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళన
కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ మంటలు ఇంకా చల్లారడం లేదు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు రైతులు బైఠాయించారు. ఈ నేపథ్యంలో వందల మంది పోలీసులు చేరి, భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే కొందరు బీజేపీ నాయకుల అరెస్ట్ చేసిన పోలీసులు..కలెక్టరేట్ వద్ద జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా పోలీసుల ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కామారెడ్డి కొత్త టౌన్ ప్లాన్కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు రావడంతో పాటు, మాస్టర్ ప్లాన్ మార్చాలని డిమాండ్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే 1,026 అభ్యంతరాలు వొచ్చాయి. ఇంకా కూడా వొచ్చే అవకాశముంది. మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్, 100 ఫీట్ల పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయా గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు మున్సిపాల్టీతోపాటు, కలెక్టర్కు అభ్యంతరాలు ఇచ్చారు.