తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన దుర్మార్గుడు కేసీఆర్..
ప్రభుత్వం పడిపోతదని ఎవరైనా మాట్లాడితే ఉరికించి కొడతాం..
రాష్ట్ర అవతరణను తప్పుపట్టిన బీజేపీకి వోట్లు అడిగే అర్హత లేదు..
రాజగోపాల్, వెంకట్ రెడ్డి భువనగిరికి డబుల్ ఇంజన్…
ముఖ్యమంత్రి అయ్యే అర్హత కోమటిరెడ్డికి ఉంది..
చామల కిరణ్ ను 3 లక్షల మెజారిటీతో గెలిపించండి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
భువనగిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : వొచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్, బీజేపీలను బొందపెట్టాలని, ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతదని పదేపదే కేసీఆర్ అంటు న్నాడని, ఇదేమైనా ఫుల్ బాటిలా పడిపోవ డానికి.. ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా మాట్లాడితే ఉరికించి కొడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆది భువనగిరి కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భువనగిరి గడ్డ పోరాటాలకు స్ఫూర్తి అని, కష్ట నష్టాల్లో పేదలకు సేవలందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే మంత్రి పదవి తీసుకుంటానని చెప్పి నల్లగొండ పోరాట యోధుడు వెంకట్ రెడ్డి అని అన్నారు. భూమికి మూరెడు లేని సన్నాసి..మంత్రి పదవికోసం కాకా పడుతున్నాడని ఇవాళ రాజగోపాల్ రెడ్డిని విమర్శిస్తున్నాడని విమర్శించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ దొరగారి దొడ్లో.. దొరకు సారాలో సోడా పోసి రాజకీయాలలోకి రాలేదని, రక్తాన్ని చెమటగా మార్చి.. భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండాను మోసి రాజకీయాల్లో పైకి వచ్చారని కొనియాడారు. తనతో పాటు ఎవరికైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే .. అది కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అధిష్టానం ఆదేశాల ప్రకారం తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని, ముఖ్యమంత్రి పదవిని నేను ఎప్పుడూ బాధ్యతతో చూసానే తప్ప.. అహంకారంతో చూడలేదన్నారు. ముఖ్యమంత్రి కాకముందు కలిసినట్టే.. ఇప్పుడూ ప్రజల్ని కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నానని తెలిపారు. కమ్యూనిస్టు సోదరులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని, మనమంతా కలిసి బీఆరెస్, బీజేపీలను బొందపెట్టాలని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ను వోడిరచాలని కేసీఆర్ అంటున్నాడని, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు. పోటీ పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగుల ఉసురు తీసుకున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 30 వేల ఉద్యోగాల వివరాలు ఇస్తామని, దమ్ముంటే భువనగిరి సెంటర్ లో చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు కాంగ్రెస్ ను ఓడిరచాలా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించినందుకు కాంగ్రెస్ ను ఓడిరచాలా? 40 లక్షల కుటుంబాలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నందుకు ఓడిరచాలా..అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పదేళ్లలో ఒక్కరికి కూడా కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందన్నారు. వంద రోజుల్లో పేదల సంక్షేమానికి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళుతున్నామని తెలిపారు. రాష్ట్ర అవతరణను తప్పుపట్టిన బీజేపీ కి వోట్లు అడిగే అర్హత లేదని చెప్పారు. కేసీఆర్ భువనగిరిలో క్యామను ముందు పెట్టి.. వెనక బూర ఊదుతున్నాడని ఎద్దేవా చేశారు. గొల్ల కురుమలను కేసీఆర్ మోసం చేస్తున్నాడని, వెనుక గూడుపుఠాని నడుపుతున్నాడని విమర్శించారు.
భువనగిరికి రాజగోపాల్, వెంకట్ రెడ్డి డబుల్ ఇంజన్ వంటివారని కొనియాడారు. చామల కిరణ్ ను 3లక్షల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మూసీని ప్రక్షాళన చేసి మూసీ మురికి నుంచి విముక్తి చేసే బాధ్యత తనదని, గంధమల్ల, బ్రాహ్మణ వెల్లం, ఎస్ఎల్బీసీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. నల్లగొండ ఫ్లోరైడ్ పాపం ఎవరిది? ఎస్ఎల్బీసీని పూర్తి చేయకుండా జాప్యం చేసి తాగునీరు అందకుండా చేసింది గత ప్రభుత్వమేనని ఆరోపించారు. చామల కిరణ్ ను గెలిపిస్తే భువనగిరిని ట్రిపుల్ ఇంజన్ లా అభివృద్ధి చేస్తారని భరోసా ఇచ్చారు. చామల కిరణ్ ను గెలిపించండి.. యదాద్రిని మళ్లీ యాదగిరిగుట్టగా మార్చుకుందామన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా మాట ఇస్తున్నానని, పంద్రాగస్టు లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని, వచ్చే పంటకు రూ.500 బోనస్ అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.