Take a fresh look at your lifestyle.

ఉప్పల్ బి  ఆర్ ఎస్ సీటు బండారి లక్ష్మారెడ్డి కే కేటాయించాలి శ్రీశైలం యాదవ్

 ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేసే ప్రజా బంధువు బండారి లక్ష్మారెడ్డి కి ఉప్పల్  బి ఆర్  ఎస్ టికెట్ ఇస్తే విజయం ఖాయమని శ్రీశైలం యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం యాదవ్  బి ఆర్  ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి కి టికెట్  ఇవ్వాలని శనివారం మల్లాపూర్ నుండి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేసే ప్రజా బంధువు బండారి లక్ష్మారెడ్డి కి ఉప్పల్  బి ఆర్  ఎస్ టికెట్ ఇస్తే విజయం ఖాయమని అని అన్ని సర్వేలలో మా ప్రియతమ నాయకుడికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అన్నారు. మరోసారి ఉప్పల్ గడ్డమీద గులాబీ జెండా ఎగరవేసేందుకు లక్ష్మన్న సైన్యం సిద్ధంగా ఉంది అని తెలియజేశారు. ఈ పాదయాత్రలో సంతు యాదవ్, అజిత్, రామ్ రెడ్డి, ముత్యంరాజ్, తనజి రావు, శ్రీను, బోదాస్ సురేష్, దీపక్, సోను ,సందీప్ ,రఘు ,మల్లేష్ రాజశేఖర్, వినోద్, నవీన్ ,సాయి, సాయి దీపక్ ,సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply