ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి (అక్టోబర్ 28) 83 వ వర్థంతి
బ్రిటిష్ ఇండియాలోని హైదరాబాద్ స్టేట్లో విప్లవ నాయకుడు భీమ్, ఇతర గోండు నాయకులతో కలిసి, 1930ల సమయంలో రాచరిక రాష్ట్రంలోని తూర్పు భాగంలో హైదరాబాద్లోని భూస్వామ్య నిజాంలకు వ్యతిరేకంగా సుదీర్ఘమైన తక్కువ తీవ్రతతో తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు, కొమురం భీమ్ బ్రిటీష్ ఇండియాలోని హైదరాబాద్ స్టేట్లోని ఆసిఫాబాద్ సమీపంలోని సంకేపల్లిలో గోండి గిరిజన సంఘంలో ఒక కుటుంబంలో 22 అక్టోబర్ 1901న జన్మించాడు. భీమ్ సాంప్రదాయ రాజ్యాలైన చందా – బల్లాల్పూర్లోని గిరిజన జనాభా అడవులలో పెరిగాడు. ఆదివాసీ, తెలుగు జానపద కథలలో కీర్తిమంతుడయ్యాడు. గోండు సంస్కృతిలో భీమ్ జల్, జంగల్, జమీన్ నినాదాన్ని రూపొందించినందుకు ఘనత పొందాడు. ఇది ఆక్రమణ, దోపిడీకి వ్యతిరేక భావాన్ని సూచిస్తుంది, ఈ నినాదాన్ని ఆదివాసీ ఉద్యమాల పిలుపుగా స్వీకరించారు. బానిస బతుకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరవేశాడు.
ఆదిలాబాద్లోని దాదాపు 12 గ్రామాలు తమ భూముల కోసం పోరాటానికి సిద్ధమయ్యాయి. గోండు, కోయ యువకులతో భీమ్ గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయుధాలతో పోరాడటానికి గిరిజన ప్రజలను సేకరించి శిక్షణ ఇచ్చాడు. అతను ప్రారంభించిన గెరిల్లా యుద్ధం ప్రధాన ప్రదేశంగా జోడేఘాట్ మారింది. ఈ గెరిల్లా యుద్ధం సహించలేక నిజాం ఆదివాసీలపై దాడి చేయించాడు. 1940 అక్టోబర్ 27న, నిజాం సైన్యం గోడెఘాట్ అడవుల్లో కొమరం భీం స్థావరాన్ని ముట్టడించి భీమ్ ను హతమార్చియి. ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున కొమరం భీమ్ వీరమరణం పొందాడు. అప్పటినుండి ఆ తిథి రోజునే కొమరం భీమ్ వర్థంతి జరుపుకోవడం ఆదివాసీల ఆనవాయితీగా కొనసాగుతోంది. సాయుధ పోలీసులచేతుల్లో హతుడయ్యాడు, తదనంతరం తిరుగుబాటుకు చిహ్నంగా సింహనాదం మయ్యాడు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది. కొత్త తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యతతో భీమ్ వారసత్వం తిరిగి వెలుగులోకి వచ్చింది. ప్రధాన స్రవంతి రాజకీయ ప్రసంగ వాక్చాతుర్యాన్నిపొందింది. 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొమరం భీమ్ ప్రాజెక్ట్ పేరుతో ఆనకట్ట, రిజర్వాయర్ను నిర్మిస్తామని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర స్థాపన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్లతో 2023లో జోడేఘాట్లో గిరిజన చరిత్ర కోసం కొమరం భీమ్ మ్యూజియం, జోడేఘాట్ హిల్ రాక్ వద్ద ఒక స్మారక నిర్మాణం కోసం మ్యూజియం మెమోరియల్ 2016లో ప్రారంభించింది. ఆదిలాబాద్ జిల్లా పునర్వ్యవస్థీకరించబడి, దానిలో కొంత భాగాన్ని కొమరం భీమ్ జిల్లాగా రూపొందించారు. జోడేఘాట్ సమీపంలోని ప్రదేశం తెలంగాణలోని ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది. గోండు తెగకు సంబంధించిన ప్రధాన్, తోటి, మన్నె,కోయ తెగలే కాకుండా నాయక్పోడ్, ఆంధ్ ఇతర ఆదివాసీ తెగలు ఆదిలాబాద్లో నివసిస్తున్నాయి. ఇప్పుడు వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
1975కు పూర్వం వలస బంజారాల జనాభా కేవలం పది వేలనని హైమన్ డార్ఫ్ స్పష్టం చేశారు. ఇప్పుడు వీరి జనాభా పదింతలపైన ఉంది. వలస వచ్చిన వాళ్ళు ప్రజాప్రతినిధులవడంతో వీరికష్టాలు రెట్టింపయ్యాయి. ఆదిమ సమాజం వీరి వల్ల రక్షణలను కోల్పోతున్నది.ఇలాంటి పరిస్థితిలో ఆదివాసీల మనుగడ కష్టమేనని ఆ నాయకులు మధనపడుతున్నారు. ఏటా విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోతున్నా, ఆదివాసులకు కనీస వైద్య సౌకర్యాలు అందడంలేదని,. ప్రతిఏటా రెండు వందల నుంచి మూడు వందల మలేరియా మరణాలు సంభవిస్తున్నాయని, పోషకాహారలేమితో మరణిస్తున్న పిల్లల సంగతి లెక్కేలేదని అసంట్ప్త్రి నెలకొండి. భీమ్ పోరాటం చేసిన ప్రాంతంలో (జోడేఘాట్) నేటికి తాగడానికి నీళ్ళులేవని. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆదివాసీ సమాజాల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయని ఆవేదన వెలువడుటొంది. ప్రభుత్వం త్వరగా మేల్కొనాలి.
– నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్ జర్నలిస్ట్,98481 28215