15 వార్డు అభివృద్ధి కోసం ఆచారిని గెలిపించండి
ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 23 : ఆమనగల్లు పాత గేరు 15 వార్డు అభివృద్ధి చెందాలంటే బిజెపి అభ్యర్థి ఆచారిని గెలిపించాలని కార్యకర్తలు నాయకులు ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15, 12 వార్డులో పుట్టి పెరిగిన ఆచారి నీ ఒకసారి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే వార్డుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అందరికీ ఇచ్చారు అవకాశం ఒక్కసారి ఆచారికి అవకాశం ఇచ్చి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కండే సాయి, జనిగల గిరి యాదవ్, బిక్షపతి, వడ్డె రాజు, వెంకట్, జంగయ్య, తదితరు పాల్గొన్నారు.