Take a fresh look at your lifestyle.

పాలనలో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యం

అర్హులందరికీ ప్రతి  ప్రభుత్వ ఫలాలు
పాలేరులో మంత్రి పొంగులేటి ఆకస్మిక పర్యటన

ఖమ్మం :  ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు సైతం తన దృష్టికి వచ్చాయని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తానని రాష్ర్ట రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హామీ ఇచ్చారు. పాలేరులో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నియోజకవర్గంలో ఆకస్మికంగా పర్యటించారు. 59వ డివిజన్ దానవాయిగూడెం, 60వ డివిజన్ రామన్నపేటలో ద్విచక్రవాహనం పై మున్సిపల్ కార్పొరేషన్  కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి
విధుల్లో తిరుగుతూ  స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తక్షణమే ఆ సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అధికారులందరూ ఎప్పటికప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలను అందించే బాధ్యత అధికారులు,  సిబ్బంది తీసుకోవాలని సూచించారు.

Leave a Reply