Take a fresh look at your lifestyle.

లక్షణాలుంటే చెప్పండి… జాగ్రత్తలు పాటించండి

  • అధిక ఖర్చు పెట్టుకుని ప్రయివేట్‌ ‌దవాఖానలకు పోవొద్దు
  • ఎంత మందికైనా చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధం
  • కొరోనా కట్టడికే ఇంటింటి జ్వర సర్వే
  • సిద్ధిపేటలో ఇంటింటికీ వెళ్లి స్వయంగా జ్వర సర్వే చేసిన ఆరోగ్య మంత్రి హరీష్‌ ‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర బ్యూరో,జనవరి 22 : కొరోనా వ్యాధి వ్యాప్తినీ అరికట్టేందుకు ఇంటింటికీ ఫీవర్‌ ‌సర్వేను చేపడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. కోవిడ్‌ ‌లక్షణాలు ఎవరికైనా ఉంటే చెప్పాలనీ, ముందస్తు అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజల దగ్గరికే వైద్య ఆరోగ్య, పంచాయితీ రాజ్‌, ‌మునిసిపల్‌ ‌సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఫీవర్‌ ‌సర్వే చేస్తుందనీ, ప్రజలంతా ప్రభుత్వం చేస్తున్న ఫీవర్‌ ‌సర్వేకు సహకరించాలని మంత్రి హరీష్‌ ‌రావు కోరారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని 37వ వార్డులో శనివారం ఇంటింటి ఫీవర్‌ ‌సర్వే జరుగుతున్న తీరును మంత్రి హరీష్‌రావు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజల యోగక్షేమాలపై దృష్టిసారించి ముందుగా ఈ వార్డులో ఆశా వర్కర్లు ఎవరనీ, అందరూ రెండో డోసు వేసుకోవడం పూర్తయిందా? అంటూ ఆశాలను మంత్రి హరీష్‌రావు ఆరా తీశారు. ఏం అమ్మా రెండు టీకాలు వేసుకోవడం పూర్తయ్యాయా..మూడో డోస్‌ ‌టీకాకు మీకు ఇంకా ఎంత కాలం గడువుందని ముచ్చటిస్తూ.. ఒక్కో ఇంటి వారిని ఆప్యాయంగా పలకరింస్తూ దగ్గరుండి టీకా వేయించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ,, ప్రతీ రోజు లక్షకుపైగా కోవిడ్‌ ‌నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు, 2 కోట్ల టెస్ట్ ‌కిట్లు, 1కోటి హోమ్‌ ఐసోలేషన్‌ ‌కిట్లు సిద్ధంగా ఉన్నాయనీ, ప్రజలెవరూ భయపడొద్దనీ, ఆందోళన చెందొద్దని..ప్రయివేటు దవాఖానలకుకు పోవద్దని ఆరోగ్య మంత్రి ప్రజలకు సూచించారు. ఒమిక్రాన్‌ ‌వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, కానీ పెద్దగా లక్షణాలు కనిపించడం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే కేసులు తగ్గుముఖం పడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫీవర్‌ ‌సర్వేలో భాగంగా గురువారం మొదటి రోజు 12 లక్షల 68 వేల మంది ఇళ్లకు మునిసిపాలిటీ, పంచాయతీరాజ్‌ ‌శాఖ సిబ్బందితో కలిసి 48వేల మందికి హోమ్‌ ఐసోలేషన్‌ ‌కిట్లు అందించినట్లు, వీరికి ఆరోగ్య కార్యకర్తలు నిత్యం ఫోన్‌ ‌లేదా స్వయంగా వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి, యోగ క్షేమాలు పరిశీలిస్తారని, వ్యాధి తీవ్రత, ఇతర సమస్యలు ఉంటే దగ్గరలోని దవాఖానకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఇంకా అవసరమైన వైద్యాన్ని ప్రజలకు ఇవ్వాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు..ఎంత మంది ప్రజలు దవాఖానాకు వొచ్చినా..టెస్టింగ్‌ ‌సెంటర్లు పెంచాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించినట్లు తెలిపారు. 5 నుంచి 8 వారాలు ఈ ఫీవర్‌ ‌సర్వే చేయిస్తారని, కొరోనా పరీక్షల కోసం లైన్‌ ఎక్కువగా ఉన్న చోట్ల మరిన్ని సెంటర్లు పెంపు చేస్తామని వెల్లడించారు. గురువారం ఒక్క రోజే 12 లక్షల మందిని పరీక్షలు చేశారని, హోమ్‌ ఐసోలేషన్‌ ‌కిట్‌ ‌ద్వారా కొరోనా లక్షణాలు పోతున్నాయని, ప్రతీ నిత్యం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తామని, అన్నీ రకాల వైద్యం చేస్తామని చెప్పారు. ఆరోగ్య తెలంగాణ కోసం వైద్య సిబ్బంది కష్టపడి పని చేస్తున్నారని, వారందరినీ అభినందిస్తున్నట్లు తెలిపారు. మందుల ద్వారా తగ్గుతుందని, ఆరోగ్య శాఖ చెప్పినప్పటికి ప్రతి రోజు సర్వే చేస్తున్నట్లు, గ్రామ ప్రజా రక్షణకై ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. గతంలో సెకండ్‌ ‌వేవ్‌ ఉధృతి సమయంలో జ్వరం సర్వే చేసి 2 కోట్ల 25 లక్షల కిట్లు అందించిందని, ఫీవర్‌ ‌సర్వే చేయడం పట్ల కేంద్రం, నీతి ఆయోగ్‌ ‌తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఇంటింటి సర్వే ఆదర్శంగా నిలిచిందని కితాబిచ్చిందని, గత ఫీవర్‌ ‌సర్వే దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని మంత్రి వెల్లడించారు.

కొరోనా కట్టడిలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పోరాడుదామని వైద్య మంత్రి హరీష్‌ ‌పిలుపునిచ్చారు. పిల్లలు కోసం ప్రత్యేకంగా, పెద్దల కోసం ప్రత్యేక వార్డు లాంఛ్‌ ఏర్పాట్లు చేసినట్లు, ప్రతీరోజూ కొరోనా పరిస్థితిని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సర్వేలపై జిల్లా కలెక్టర్లు సమీక్ష జరుపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 27 వేల ఆక్సిజన్‌ ‌బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, ఆక్సిజన్‌ ‌సామర్థ్యం పెంచినట్లు, గతంలో 120 మెట్రిక్‌ ‌టన్నుల సామర్థ్యం ఉండగా, దాన్ని ఇప్పుడు 370 మెట్రిక్‌ ‌టన్నుల సామర్థ్యంకు పెంచి నిల్వలు సిద్ధంగా పెట్టినట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం పని చేస్తుందని, గ్రామ ప్రజల ఆరోగ్య కోసం ప్రజా ప్రతినిధులు కలిసి పని చేయాలని, రాష్ట్రంలో ఎక్కడా కూడా వైద్య ఖాళీలు లేకుండా అన్నీ భర్తీ చేయాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించారని, అన్నీ పోస్టులు భర్తీ చేసినట్లు వైద్య మంత్రి తెలిపారు. ఎక్కడైనా ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయమని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

ప్రజలెవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఆశా కార్యకర్తలు సమాచారం అందించి, వారి సేవలు వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని, దీంతో ప్రాణానికి ముప్పు ఉండదని, రక్షణ కవచంగా టీకా పని చేస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. సెలవు రోజులలో కూడా వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు, లక్షణాలు ఉంటే ఆరోగ్య కార్యకర్తలకు చెప్పాలని, స్వంత వైద్యం మంచిది కాదని, చేసుకోవద్దని, ప్రయివేటు దవాఖానలోకి పోయి డబ్బులు వృథా చేసుకోవద్దని ఆరోగ్య మంత్రి ప్రజలకు సూచించారు. మంత్రి వెంట మునిసిపల్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌కడవేర్గు మంజుల రాజనర్సు, ఏఎంసి ఛైర్మన్‌ ‌పాల సాయిరాం, డిఎంహెచ్‌వో మనోహర్‌, ‌నోడల్‌ అధికారి డాక్టర్‌ ‌కాశీనాథ్‌, ‌మునిసిపల్‌ ‌కమిషనర్‌ ‌రవీందర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, మునిసిపల్‌ అధికారులు, సిబ్బంది, స్థానిక టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్వరం, ఇతర లక్షణాలుంటే అక్కడికక్కడే మెడిసిన్‌ ‌కిట్లను పలువురికి అందించి వాటి గురించి మంత్రి హరీష్‌రావు వివరించారు.

Leave a Reply