Take a fresh look at your lifestyle.

హుజూరాబాద్‌ ‌ప్రజలను అవమానించిన కెసిఆర్‌

‌బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌
హుజురాబాద్‌లో ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీలు ప్రచార జోరును పెంచుతున్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా మంగళవారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీపై విమర్శలు గుప్పిస్తునే బీజేపీ ఈటల గెలిస్తే నియోజకవర్గానికి వొచ్చే పనులను వివరించారు. తరుణ్‌ ‌చుగ్‌ ‌మాట్లాడుతూ కేసీఆర్‌ ‌కుటుంబం హుజురాబాద్‌ ‌ప్రజలను, రాష్ట్ర ప్రజలను అవమానించిందని, కుక్కను పెట్టినా గెలుస్తామని అన్నారన్నారు.

ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ అహంకారానికి వ్యతిరేకంగా ప్రజా తీర్పు ఉండబోతుందన్నారు. రాజరిక, దోపిడీ, అవినీతి ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని డిసైడ్‌ అయ్యారన్నారు. కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌ల మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తుందని తరుణ్‌ ‌చుగ్‌ ‌వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్‌లతో కుమ్మక్కయిన టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కేవలం ధనవంతుల కోసమే పనిచేస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో ఈటల గెలిస్తే హుజూరాబాద్‌లో 60 రోజుల్లో రైల్వే అండర్‌ ‌బ్రిడ్జ్ ‌పూర్తి చేయడంతో పాటు గ్రావి•ణ సడక్‌ ‌యోజన నిధులు తీసుకొస్తామని, హుజురాబాద్‌ అభివృద్ధికి సహకరిస్తామని తరుణ్‌ ‌చుగ్‌ ‌చెప్పారు.

Leave a Reply