తాండూరు : స్వీయ నియంత్రణతోనే కొరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని వికారాబాద్ జిల్లా ఎంపిటిసిల ఫోరం ఉపాధ్యక్షులు దేవగిరి రాములు అన్నారు. బుధవారం యాలాల మండల పరిధిలోని ముద్దాయి పేట్లో ఆయన ఉపాధి హామీ సిబ్బందికి వైరస్ నియంత్రణకై శానిటైజర్ను, మాస్క్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కొరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉపాధి హామీ సిబ్బందికి శానిటైజర్స్ మాస్క్ లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, సెక్రెటరీ జోతి లీంగం, ఉపసర్పంచ్ , సభ్యులు కార్యకర్తలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.