రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తొలి విడుత జాబితాను విడుదల చేసింది. 55మందితో కూడినతొలి జాబితా విడుదల చేయగా…వీరిలో ఉమ్మడి మెదక్ జిల్లా నుండి 5గురు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో… సంగారెడ్డి నుండి తూర్పు జయప్రకాష్రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి, ఎస్సి రిజర్వుడు ఆందోల్ నుండి దామోదర రాజనర్సింహా, గజ్వేల్ నుండి తూంకుంట నర్సారెడ్డి, జహీరాబాద్ ఎస్సి రిజర్వుడు నుండి ఏ.చంద్రశేఖర్, మెదక్ నుండి మైనంపల్లి రోహిత్రావు పేర్లను ప్రకటించింది.