బిజెపి మతపరంగా విభజించాలని చూస్తుంది
ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మాణికం టాగూర్
బీజేపీ మతపరంగా విభజించాలని చూస్తుందని, టిఆర్ఎస్ అవినీతి సొమ్మును పంచి రాజకీయాలు చేస్తుందని ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మాణికం టాగూర్ విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోనే పార్టీకి విజయం చేకూరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మాణికం టాగూర్లు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా టాగూర్ మాట్లాడుతూ …హైదరాబాద్ అన్ని రకాల, వర్గాల కలయికలతో జీవనం సాగించే నగరమని, దేశంలో ప్రధాన నగరాల్లో ఒక్కటని అన్నారు. టిఆర్ఎస్ అవినీతి పాలన పెచ్చుపెరిగిపోయిందని, మునిసిపల్ మంత్రి, ఆయన అనుచరులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. బీజేపీ మతం, టిఆర్ఎస్ అవినీతితో కూడుకొని ఉన్నాయని మండిపడ్డారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జయదేవకర్ టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతికి పాల్పడుతుందని అంటున్నారు మరి ఐటి, ఈడీ, సీబీఐ కేంద్ర విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.