- దేశవ్యాప్తంగా మరో 1,718 పాజిటివ్ కేసులు
- కోలుకున్న 630 మంది బాధితులు
- లారీ డ్రైవర్లకు స్క్రీనింగ్ చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు
- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,718 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కొరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,610కు చేరింది. వైరస్ నుంచి కోలుకునే వారి సంఖ్య పెరిగిందని, గత 24 గంటల్లో 630 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. దేశంలో కరోనా రికవరీ రేటు 25 శాతం పైగానే ఉందన్నారు. కరోనా నుంచి ఇప్పటివరకు 8,324 మంది కోలుకున్నారని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు నమోదైన కొరోనా మరణాల్లో 78 శాతం ఇతర వ్యాధులతో బాధపడే వారివి కూడా ఉన్నాయని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే పరీక్షలు చేయాలని, లారీ డ్రైవర్లకు స్క్రీనింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించామని చెప్పారు. లాక్డౌన్లో వలస కూలీలకు ఆహారం అందిస్తున్నామని, భౌతిక దూరం పాటించడంలో చాలావరకు అవగాహనకు వచ్చారని తెలిపారు. కొరోనా ప్రభావం లేని చోట ఇప్పటికే చాలా సడలింపులు ఇచ్చామని వెల్లడించారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా
వస్తున్నాయని ఆయన చెప్పారు. వైరస్ ప్రభావం లేనిచోట్ల ఇప్పటికే చాలా సడలింపు ఇచ్చినట్లు కేంద్రం స్పష్టం చేసింది. కరోనా వల్ల మరణించిన వారిలో 78 శాతం మందికి ఇతర వ్యాధులు కూడా ఉన్నాయని లవ్ అగర్వాల్ ప్రకటించారు.