Take a fresh look at your lifestyle.

మాధాయపల్లి  గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 15 : తలకొండపల్లి మండలంలోని మాధాయపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని  బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపిపి సీఎల్ శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన 30 మంది నాయకులు శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో  బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని గులాబి  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా  సి ఎల్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్  నిరుపేదలకు అందించిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరినట్లు తెలిపారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. మరోసారి కల్వకుర్తి ఎమ్మెల్యేగా  జైపాల్ యాదవ్ గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ కో ఆప్షన్ మూజీబూర్ రహేమాన్, సర్పంచ్ హైమావతి రామస్వామి, ఉప్ప సర్పంచ్ జయ్యమ్మ శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, నాయకులు యాదయ్య, తీర్పతయ్య, దశరథం, మల్లేష్, అంజయ్యగౌడ్, శేఖర్, సత్యం గౌడ్, భగవంతు, నిరంజన్, పరంజ్యోతి, శ్రీశైలం, పెంటయ్య, ప్రశాంత్, విజయ్ కుమార్, సుధాకర్, రాజు, సతీష్, వినోద్, రామచంద్రయ్య, రామస్వామి, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply