Take a fresh look at your lifestyle.

మంత్రి మహేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గనుల భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి కి తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం రాష్ట్ర మంత్రి ఈ మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ హైదరాబాద్లోని మంత్రి నివాసంలో  పార్టీ నాయకులతో కలిసి మంత్రికి పూల బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మంత్రి మహేందర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీ రెండవసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టి తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. మరింత భవిష్యత్తులో ప్రజాసేవ చేసేందుకు  ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేలా దేవుని ఆశీస్సుల ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకో వాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యాలల మండల ఎంపీపీ బాలేశ్వర గుప్తా, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆశన్న, సప్తగిరి గౌడ్, యలాల పిఎసిఎస్ వైస్ చైర్మన్ వడ్డె రాములు, అమర్నాథ్ రెడ్డి లాలప్ప శేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply