ఆర్థిక సహాయం అందజేత
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 : మైసిగండి గ్రామానికి చెందిన జాటవత్ సీత్యా నాయక్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను మైసిగండి సర్పంచ్ తులసి రామ్ నాయక్ పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.