Take a fresh look at your lifestyle.

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: జిల్లాలో మద్యం షాపుల నిర్వహణకు ఎస్సీ, బిసిగౌడ కులస్తుల రిజర్వేషన్ ఎంపిక కొరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ మధ్య ఎస్సీ అభివృద్ధి శాఖ, బీసీ అభివృద్ధి శాఖల అధికారుల సమక్షంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డ్రా నిర్వహించారు. జిల్లాలో మొత్తం 93 మద్యం దుకాణాలు ఉండగా వాటిలో 9 ఎస్సీ సామాజిక వర్గానికి 16 గౌడ కులాలకు లాటరీ ద్వారా షాపులను ఎంపిక చేసి వాటి ఆమోదానికి రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ కు పంపిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె. పాటిల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటిండెంట్ శ్రీనివాసమూర్తి, జిల్లా ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారి కవిత, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి మురళి, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply