Take a fresh look at your lifestyle.

ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిది : కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 27 : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో ఆమనగల్లు మండలానికి చెందిన ఎండి జాహంగీర్ కు రూ. 60, 000వేలు, సంకటోనీపల్లి గ్రామానికి చెందిన కిష్టమ్మకు రూ.45,000 వేల ఎల్ ఓ సి, సీఎం సహాయనిధి చెక్కును గురువారం కల్వకుర్తి శాసన సభ్యులు జైపాల్ యాదవ్ నివాసంలో లబ్దిదారులకు ఎమ్మెల్యే, వైస్ ఎంపీపీ చేతులమీదుగా లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు వైస్ ఎంపీపీ జక్కు అనంత రెడ్డి, మాడుగుల మండల మాజి ఎంపీపీ జైపాల్ నాయక్, మరియు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply