60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏమి అభివృద్ధి చేసింది లేదు
షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 21: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కోత్తూరు మండల పరిధిలోని ఇన్మల్ నర్వ గ్రామంలో బిఆర్ ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవము గ్రామ సర్పంచ్ పాత్లావత్ అజయ్ మీట్టూ నాయక్ ఆధ్వర్యంలో ఎంపీపీ రవీందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవము చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మిట్టూ నాయక్, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మే సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షులు పెంటనోళ్ళ యాదగిరి, కోత్తూరు మండల అధ్యక్షులు బెండే కృష్ణయ్య, సిరాజ్, రషీద్, లావుడ్య గోపాల్ నాయక్, శ్రీరాములు యాదవ్,ఇంద్రసేనారెడ్డి ,సతీష్ గుప్తా, బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు హాజరుయ్యారు.