దేశ ప్రజలకు ప్రధాని మకర సంక్రాంతి శుభాకాంక్షలు
న్యూ దిల్లీ, జనవరి 14 : మకర సంక్రాంతి, మాగ్ బిహు, ఉత్తరాయన్, పొంగల్, భోగీని పురస్కరించుకుని దేశ పౌరులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగలు భారతదేశ శక్తిమంతమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని సూచిస్తాయని మోదీ పేర్కొన్నారు. ‘మకర సంక్రాంతి, మాగ్ బిహు, ఉత్తరాయన్, పొంగల్, భోగి సందర్భంగా వి• అందరికీ శుభాకాంక్షలు. ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉన్న ఈ పండుగలు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఆనందాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
బోగి పండుగ సందర్భంగా సకల జనులకు ఆ భగవంతుడు భోగభాగ్యాలు, సుఖసంతోషాలు కలిగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చెన్నై కోట్టూర్ పురంలోని స్వగృహం వద్ద వెంకయ్యనాయుడు దంపతులు భోగిమంటలు వేశారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. ’దేశ ప్రజలకు భోగి శుభాకాంక్షలు. ప్రతికూల ఆలోచనలు వదిలి, సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలనే సందేశాన్నిచ్చే ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లోకి నూతన కాంతులను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.