Take a fresh look at your lifestyle.

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిస్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు పట్టణంలోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ కంసే విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన బాపూజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలను, ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించాలని సొంత నిధులతో బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన రాజకీయ అవకాశాలు కావాలని కోరుకున్న వ్యక్తుల్లో ప్రథముడు బాపూజీ అని కొనియాడారు.  తొలి దశ మలిదశ తెలంగాణ పోరాటంలో బాపూజీ పాత్ర మరువలేనిదని అన్నారు. ఆయన ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు కొమర గూడెం వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, పద్మశాలి సంఘం చైర్మన్ రాజమల్లయ్య, అధ్యక్షులు వేముల రమేష్, ప్రతినిధులు రఘు రాములు, మధు, అర్జున్, లక్ష్మణ్, ప్రభు, శ్రీరామ్ అశోక్, గీత శేకర్, నాగరాజు, ప్రసాద్, చంద్ర మౌళి, పశుపతి, కుమార్, సంతోష్, పట్టణ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply