భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా ఆమనగల్లు పట్టణంలోని శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి సేవాసమితి ఆమనగల్ వారి ఆధ్వర్యంలో సత్యసాయి మందిరంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ దొంతు శ్రీనివాస్, దొంతు విశ్వనాథం, దొంత పుల్లయ్య, కృష్ణారెడ్డి, ఎన్ఆర్ ప్రభాకర్, నారాయణసాగర్, బ్రహ్మం, రాము, రామాచారి, సంజీవ్ కుమార్, పోలిశెట్టి శ్రీనివాస్, శంకర్, అల్లాజి, మల్లేష్, పూల శ్రీను, అప్పం తిరుపతయ్య, సతీష్, విడియాల ప్రసాద్, లింగం, శ్రీధర్, దొంతు సంధ్య, సృజన, శైలజ, అప్పం అలివేలు, దొంతు కృష్ణవేణి, దొంతు సృజన, అశ్విని, అనిత, సింధు పాల్గొన్నారు.