కొడంగల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 30: కొడంగల్ పట్టణ కేంద్రంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటు హక్కును వినియోగించడానికి ముందు కొడంగల్ లోని తన స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ సందర్భంగా గోమాత చుట్టూ ప్రదక్షణలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి పిసిసి మెంబర్ యండి యూసుఫ్ శ్రీరామ్ రెడ్డి కొడంగల్ మండల ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ తదితరులు పాల్గొన్నారు.