Take a fresh look at your lifestyle.

నేడు మంత్రులు, ఎంఎల్‌ఏలతో కలిసి… సిఎం కాళేశ్వరం సందర్శన

అక్రమాలను బయటపెట్టడమే లక్ష్యం
 వేలకోట్లు నీటి పాలయ్యాయని నేతల ఆరోపణ

హైదరాబాద్‌, ఫ్రిబ్రవరి ఫిబ్రవరి 12 : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ లోపాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలు నేరుగా పరిశీలించనున్నారు. దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి ఆయన నేడు మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ వద్దకు రానున్నారు. బ్యారేజీలో నిర్మాణ లోపాలు, కుంగుబాటుకు కారణాలను అధికారులు ఆయనకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించ నున్నారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున రావడంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మరింత అప్రమత్తం మయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లోభాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్ట్‌ దెబ్బతిన్న ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సందర్శించ నున్నారు. మంగళ వారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కలిసి ఆయన స్వయంగా బ్యారేజీని పరిశీలించ నున్నారు. ప్రజల సమక్షంలోనే అధికారు లు  బ్యారేజీ దెబ్బతినడానికి  కారణాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వెల్లడిరచను న్నారు.

శాసస సభలో నీటి పారుదలశాఖపై  శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం… అందులో మేడిగడ్డ లోపాలను ప్రత్యేకంగా ఎత్తిచూపింది. నీటిపారుదల శాఖలో అవినీతి, అక్రమాలపై చర్చించనుంది. సభలో తాము చెప్పినవన్నీ నిజాలే అని నిరూపించేందుకే ఎమ్మెల్యేల బృందంతో  సీఎం రేవంత్‌ రెడ్డి మేడిగడ్డ సందర్శించ నున్నారు. కేవలం పేపర్‌పై మాటలు చెప్పడం కాదని….తాము చేసిన ఆరోపణ లను రుజువులతో సహా నిరూపిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి గత సమావేశాల్లోనే సవాల్‌ విసిరారు. నీటి పారుదలశాఖపై జరిగే చర్చలో ప్రతిపక్షనేత కేసీఆర్‌ సైతం పాల్గొనాలని కూడా రేవంత్‌ రెడ్డి కోరారు. మేడిగడ్డ సందర్శనకు  కేసీఆర్‌ తోపాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అంతా రావాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. ముఖ్య మంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా మేడిగడ్డ సందర్శనకు రానుండటంతో పోలీసు యంత్రాంగం మూడు అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి , మంత్రులు, ఎమ్మెల్యేలు వొచ్చే మార్గంలో కల్వర్టులు, రహదారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సీఎం హోదాలో తొలిసారి రేవంత్‌ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తుండటంతో  పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అదనపు బలగాలను  మోహరించారు. స్పెషల్‌ పోలీసులు అటవీ ప్రాంతంలోని గ్రామాలను జల్లెడపడుతున్నారు. మేడిగడ్డ సందర్శన అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజాపాలన పేరిట సీఎం రేవంత్‌ రెడ్డి వారితో నేరుగా ముఖాముఖి నిర్వహించనున్నారు. కేసీఆర్‌ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఇప్పటికే విమర్శలు వొచ్చాయి. అదంతా మేడిపండు చందంగా మారిందని తేలింది. ఇదిలా ఉంటే కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 13న నల్గొండలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ ఏర్పాటు చేసిన రోజే..కావాలని సీఎం రేవంత్‌ రెడ్డి మేడిగడ్డపై దండయాత్రకు వెళ్తున్నారని వారు ఆరోపించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాభవన్‌లో ఆదివారం ప్రత్యేక సమావేశం అయి పలు కీలక అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.

Leave a Reply