కాళేశ్వరం ప్రాజెక్టును మరోమారు సీఎం కేసీఆర్ సందర్శించి పనులపురోగతిపై అధికారులతో సక్షించనున్నారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరకు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. మూడో టీఎంసీ పనులకు సంబందించి పంప్హౌస్ల పరిశీలన కాళేశ్వరం పురోగతిపై అధికారులతో సక్షించనున్నారు. ఈ మేరకు గురువారం సిఎం కాళేశ్వరం వెళ్లనున్నారు. ఇదిలావుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై నిర్మితమవుతున్న తుపాకులగూడెం బ్యారేజీకి వనదేవత ’సమ్మక్క’ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ’సమ్మక్క బ్యారేజీ’గా నామకరణం చేస్తూ సంబంధిత జీవో జారీ చేయాలని ఈఎన్సీ మురళీధర్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముక్కోటి దేవతల కరుణా కటాక్షాలు బలంగా వుండడం చేతనే తెలంగాణలో అభివృద్ది అనుకున్న రీతిలో సాగుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి తెలంగాణ పొలాలలకు కాళేశ్వరం సాగునీళ్లు చేరుకుంటున్న శుభ సందర్భంలో ఇప్పటికే పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. గురువారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో బుధవారం ప్రగతి భవన్లో సంబంధిత అధికారులతో సక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులలోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుకుంటున్నది.
ఇప్పుడు మనం కట్టుకున్న బ్యారేజీలు నిండుకుండలా మారాయన్నారు. రానున్న వానం కాలం నుంచి వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రాణహిత ద్వారా లక్ష్మీ బారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తి పోసుకునే దిశగా.. అటునుంచి కాలువలకు మల్లించే దిశగా.. ఇర్రిగేషన్ శాఖ ఇప్పటినుంచే అప్రమత్తం కావాలి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. అందులో భాగంగా పనుల విభజన చేసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు తెలిపారు. ఈ సక్షా సమావేశంలో మంత్రులు గుంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు, తదితరులు పాల్గొన్నారు.