Take a fresh look at your lifestyle.

ఆలోచించి ఓటు వేయండి అభివృద్ధిలో భాగస్వాములు కండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 27: పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి అభివృద్ధి కొనసాగించాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన అనంతరం తెల్లాపూర్ గ్రామాన్ని మున్సిపాలిటీగా తీర్చిదిద్ది మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని తెలిపారు.ప్రతి కాలనీలో సిసి రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పార్కులు వీధి దీపాలు ఇంటింటికి రక్షిత మంచినీరుఅందించడంతోపాట అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు.దశాబ్ది కాలంలో ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకొని ప్రతిపక్ష పార్టీలు నేడు ఏమి మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. ప్రగతికి నిరోధకులుగా మారిన ప్రతిపక్ష పార్టీలకు ఓటుతో గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి ఘన విజయాన్ని అందించాలని కోరారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, పార్టీ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply