Take a fresh look at your lifestyle.

ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర అక్టోబర్ 16: అనంతగిరిలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి  ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు..వికారాబాద్ మండల పరిధిలోని పెండ్లిమడుగు గ్రామంలో మొదటిరోజు ఎన్నికల ప్రచారం. బోనాలతో, పూల వర్షంతో పెద్ద ఎత్తున స్వాగతం పలికిన గ్రామ ప్రజలు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్  నియోజకవర్గంలో మనమే గెలుద్దామని, మనకు అవసరమైన అభివృద్ధి మనమే చేసుకుందామన్నారు.నవంబర్ 30న “కారు గుర్తుకు” ఓటేసి భారీమెజారిటీతోగెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply