ప్రదాన మంత్రికిసాన్ సమ్మాన్ నిధి పదకంలో లబ్ది పొందుతున్న రైతులు తప్పని సరిగా కిసాన్ క్రెడిట్ కార్డు కలగి ఉండాలని మండల వ్యవశాయ అధికారి నవీన్ కుమార్ అన్నారు. భూసార పరీక్షా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుదవారం కొత్తూరు గ్రామానికి చెందిన 166 మంది గిరిజన రైతులకు భూసార పరీక్షా పత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా రైతులకు ఏఏ పంటలు వేయాలి, ఎరువుల వాడకం యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పించారు. కిసాన్ క్రెడిట్ కార్టులు లేని రైతులు పట్టాదారుపాసు పుస్తకం, భ్యాంకు ఖాతా బుక్, ఆధార్ కార్డు జిరాక్స్తో సంబందిత బ్యాంకు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఇఓలు బాలాజీ, ప్రవీణ్కుమార్ తదితరులు ప్గాన్నారు.