మంత్రి హరీష్ రావు సమక్షంలోబిఆర్ఎస్ పార్టీలో చేరిన ఖమ్మం పల్లి కాంగ్రెస్ నాయకులు
సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20: ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధికి ఆకర్షితులై కెసిఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రిగా చేయుటకు మేమంతా బిఆర్ఎస్ పార్టీ వైపు ఉండి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని సోమవారం ఖమ్మం పల్లి గ్రామానికి చెందినకాంగ్రెస్ పార్టీ నాయకులు.స్థానిక ఎంపీటీసీ యాదగిరి మాజీ సర్పంచ్ దామశంకర్ మండల నాయకులు మంద శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డు సభ్యులు వల్లంగళ్ళ రాజేష్, పెద్దోల శేఖర్, వల్లంగళ్ల కనకయ్య.పెద్ద సాయి పరమేశ్వర్, వల్లంగళ్ళ అనిల్, వల్లంగళ్ల స్వామి దాస్, వల్లం గళ్ళ అనిల్ కుమార్, తోళ్ల మల్లయ్య, రామ సాగరం, నర్సింలు, రాగపురం శివ, తోళ్ల కర్ణాకర్, రాజమళి, ప్రవీణ్, తోళ్ల సంజీవ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మరుపు భూమి రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ లక్కిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ర్యాగల దుర్గయ్య, మాజీ మండల పార్టీ అధ్యక్షులు అనంతల నరేందర్,సీనియర్ నాయకులు అంబటి భానుచందర్ గౌడ్, గొట్టే ఐలయ్య, ఉన్నారు.