Take a fresh look at your lifestyle.

సొంత డబ్బులతో వికలాంగులకు బస్సు పాసులు ఇప్పించిన డా. నరోత్తమ్ నాయుడు

ప్రజాతంత్ర కొడంగల్ సెప్టెంబర్ 9 : దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట గుండె పల్లి గ్రామాల నిరుపేద కుటుంబాలకు చెందిన 50 మంది వికలాంగులను గుర్తించి బలంపేట గ్రామానికి చెందిన డాక్టర్ నరోత్తం నాయుడు పేద ప్రజలకు ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో తన సొంత డబ్బులతో బస్సు పాసులు ఇప్పించడం జరిగింది. వికలాంగుల సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశం ఆర్టీసీ బస్సు( RTC bus )లో వికలాంగులు ప్రయాణిస్తే 50% మాత్రమే డబ్బులు చెల్లించవలసి ఉంటుందని, వికలాంగుల కోసం ప్రతి బస్సులో ప్రత్యేక సీటు ఏర్పాటు చేయడం జరిగిందని, వికలాంగులు మనోధైర్యంతో ముందుకు సాగాలని వీరికి తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దివ్యాంగుల బస్సు పాస్ ఇంచార్జ్ రామ్ చందర్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు రమేష్ నాయక్ గ్రామస్తులు దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply