కొరోనా బారిన పడి కోలుకున్న 31 మంది పోలీసులు
ట్రాఫిక్ విధుల్లో చేరిన వారికి సిపి అభినందన
కోవిడ్-19 బారిన పడి కోలుకున్న 31 మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లోకి చేరారు. కొరోనా బారిన పడి కోలుకున్న31 మంది ట్రాఫిక్ పోలీసులను సీపీ అంజనీకుమార్ సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రొఫెషనల్ పోలీస్ లైఫ్లో ఇంత కష్టతరమైన పరిస్థితి రావడం.. దానిని పోలీస్ సిబ్బంది అధిగమించడం సంతోషమన్నారు.
లాక్డౌన్, నియంత్రణ ప్రదేశాలు, వలస కూలీల తరలింపులో పోలీసులు ఎంతో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కొరోనా ప్రబలి పోయిందని, ఈ విపత్కర పరిస్థితుల్లో పోలీసులు ముందుండి ప్రజలకు సేవ చేయడం హర్షణీయమని అంజనీకుమార్ తెలిపారు.