- ఇంకా నీటిలో, అంధకారంలో పలు కాలనీలు
- విద్యుత్ సరఫరాకు అంతరాయం.. పునరుద్ధరణకు తీవ్ర ఇబ్బందులు
భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల విద్యుత్కు తీవ్ర అంతరాయం కలిగింది. తాజాగా ఇప్పుడు విద్యుత్ పునరుద్దరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అలాగే జిహెచ్ఎంసి, మిలిటరీ సహాయకులు ప్రజలను రక్షించే పనిలో పడ్డారు. అలాగే నాలాల పూడికతీత పనులు కొనసాగిస్తున్నారు. కాలనీల్లో నీరు పోయేలా చేస్తున్నారు. హైదరాబాద్లో నీట మునిగిన కాలనీల్లో ఇంకా విద్యుత్ పురుద్ధరణకు నోచుకోలేదు. అవి నీటినుంచి బయటపడితే తప్ప పునరుద్దరణ సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. కుండపోతగా కురిసిన వర్షానికి హైదరాబాద్ మహానగరంలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. పలుప్రాంతాల్లో నగరం అంధకారంలో మునిగిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 800 ఫీడర్లు ఉండగా దాదాపు 400 ఫీడర్లలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు.
సోమవారం సాయంత్రం గల్లంతయిన కందుకూరు ,బాచుపల్లి గ్రామానికి
సోమవారం సాయంత్రం గల్లంతయిన కందుకూరు ,బాచుపల్లి గ్రామానికి