Take a fresh look at your lifestyle.

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి కాంగ్రెస్‌ ‌నేత శ్రీనివాస్‌ ‌రెడ్డి

తాండూర్‌: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్‌ ‌పార్టీ మున్సిపల్‌ ‌ఫ్లోర్‌ ‌లీడర్‌ ‌శ్రీనివాస్‌ ‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల కురిసిన అకాల వర్షంతో తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్‌, ‌తాండూర్‌, ‌పెద్దేముల్‌, ‌యాలాల మండలాల్లో చేతికి వచ్చిన వరి పంట వర్షంతో పూర్తిగా తడిసిపోయిందని, అదే విధంగా ఈదురు గాలులుతో మామిడి తోటల్లో కాయలు రాలిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. జరిగిన పంట నష్టాన్ని గుర్తించి తగిన పరిహారం అందించి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply