Take a fresh look at your lifestyle.

అజ్ఞానంలో ఉన్న  మాన‌వాళికి జ్ఞానోద‌యాన్ని క‌ల్గించిన జ్ఞాన జ్యోతి శ్రీశ్రీశ్రీ వీర బ్రహ్మేంద్ర‌స్వామి   బండారి లక్ష్మారెడ్డి 

  ఉప్పల్, ప్రజాతంత్ర,  నవంబర్ 24:  అజ్ఞానంలో మ‌గ్గిపోతున్న మాన‌వాళికి జ్ఞానోద‌యాన్ని క‌ల్గించిన జ్ఞాన జ్యోతి  వీర బ్రహ్మేంద్ర‌స్వామి అని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు.  శుక్రవారం శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి  415వ జయంతి మహోత్సవం సందర్భంగా మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ లోని వీరబ్రహ్మేంద్రస్వామి   విగ్రహానికి  ఉప్పల్  బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి  బండారి లక్ష్మారెడ్డి పూలమాలలు వేసి  ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వామివారి ఆరాధనలో పాల్గొని ప్రత్యేక పూజలు  నిర్వహించారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూస‌మాజంలోని మూఢ  విశ్వాసాల‌ను ఖండిస్తూ.. అజ్ఞానంలో మ‌గ్గిపోతున్న మాన‌వాళికి జ్ఞానోద‌యాన్ని క‌ల్గించిన జ్ఞాన జ్యోతి  వీర బ్రహ్మేంద్ర‌స్వామి అని  అన్నారు.కుల‌,మత, వ‌ర్గ వ‌ర్ణాల‌కు అతీతంగా స్వామివారి బోధ‌న‌లు అన్నివ‌ర్గాలప్ర‌జ‌ల‌కువాస్త‌విక‌త‌నుతెలియ‌జెప్పిన  తెలియ‌జెప్పిన గొప్ప మహనీయుడని బండారి లక్ష్మారెడ్డి కొనియాడారు.కార్యక్రమంలోకార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్,   కాప్రా సర్కిల్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నూతలపాటి మల్లికార్జున చారి,మాజీ కార్పొరేటర్లు  శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య,  వంజరి ప్రవీణ్, ఛైర్మన్ ఆర్. లక్ష్మీనారాయణ , శ్రీనివాస్ చారి, ప్రధాన కార్యదర్శి సమన్ని మురళి చారి, కోశాధికారి శ్యాంసుందర్, సంఘ సభ్యులు బ్రహ్మంగారి భక్తులు  స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply