సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 31. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమంతంగా ఉండాలని ఆమనగల్లు ప్రభుత్వ వైద్య అధికారి పరీకత్ అన్నారు. సోమవారం మున్సిపాలిటీలోని సూర్యలక్ష్మి పత్తి మిల్లులో అవగాహన సదస్సు, ఆరోగ్య వైద్య శిబిరము నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కండ్ల కలక, కీటక జనిత వ్యాధులు సాంక్రమిక వ్యాధులు టీబీ వ్యాధి వ్యాప్తి పై అవగాహన మరియు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. టీబీ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారిని విజయలక్ష్మి, కాటన్ మిల్ అధ్యక్షులు ఆర్ఎల్ -నారాయణ, వైస్ ప్రెసిడెంట్ సాయిబాబా, కేశవరెడ్డి, సిహెచ్ఓ విజయ, పి హెచ్ ఎన్ -లక్ష్మి, సూపర్వైజర్ శ్రీనివాస్, టీబీ సూపర్వైజర్ విజయ్, అలీమ్, మహిళా ఆరోగ్య కార్యకర్తలు సీత, మరియు అసిఫా, ఆశా కార్యకర్త సల్మా, తదితరులు పాల్గొన్నారు