హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో శోభా యాత్ర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లించనున్నారు.
రేపు ఉదయం 11:20 గంటలకు ఆంజనేయుని శోభా యాత్ర ఊరేగింపు గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమై..తాడ్బండ్ సికింద్రాబాద్ వరకు గౌలిగూడ రామమందిరం, పుత్లిబౌలి క్రాస్ రోడ్, ఆంధ్రా బ్యాంక్ క్రాస్ రోడ్, కోటి, సుల్తాన్ బజార్, రాంకోటి, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి వ్నిదుగా కొనసాగనుంది.