Take a fresh look at your lifestyle.

నీలం మధుకు హెచ్.సీ.యూ విద్యార్థి సంఘాల నేతల మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 21 : తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన బిసిలను రాజకీయ పార్టీలు మోసం చేశాయని, బిసిలను మోసం చేసిన కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పి రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న బిసి, బహుజన ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు పటాన్ చెరువులో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలం మధు ముదిరాజ్ ను గెలిపించుకోవాలని హైదరాబాద్సెంట్రల్యూనివర్సిటీ (హెచ్.సీ.యూ)లో యూనివర్సిటీ(హెచ్.సీ.యూ)లో ఉన్న బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్, తెలంగాణ బిసి విద్యార్థి సంఘ నాయకులు, దళిత విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం హెచ్.సీ.యూ ఎదుట వివిధ సంఘాలకు చెందిన విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నిరంతరం బహుజన, బడుగు బలహీనర్గాల ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తూ, బిసిల అభివృద్ధి సంక్షేమం కోసం పరితపించే నీలం మధు ముదిరాజ్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. నీలం మధు ముదిరాజ్ కు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా పటాన్ చెరువులో అగ్రకుల రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. అలాగే బహుజన సమాజ్ పార్టీ తెలంగాణలో బిసిలకు అత్యధిక సీట్లు కేటాయించిందని, తెలంగాణలో ఉన్న అన్ని నియోజక వర్గాలలో బిసి బిడ్డలను గెలిపించుకోవాలన్నారు. హెచ్.సీ.యూ నుండి తెలంగాణ ప్రజలకు, నిరుద్యోగులకు, బిసిలకు, విద్యార్థి సమాజానికి, ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు పిలుపునిచ్చారు. అలాగే నీలం మధు పేరుతో నూతన పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శివ ముదిరాజ్, జోగు రమేష్, ఎర్రోళ్ల అంజి, అసుర పరుశురాం, విమల, ప్రసన్న, త్రివేణి, మోజేస్, దివాకర్, జగదీష్, సురేష్, నవీన్, రఘు, వెంకటేష్, అజయ్ మరియు పరిశోధక, మాస్టర్స్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply