Take a fresh look at your lifestyle.

ఘనంగా పారిజాత నర్సింహ రెడ్డి జన్మదిన వేడుకలు 

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 2: బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి తన జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. బుధవారం ఉదయం నుంచే బాలాపూర్ లోని పారిజాత నర్సింహ రెడ్డి ఇంటికి మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కేక్ లు కట్ చేసి, శాలువతో సత్కరించి పుష్ప గుచ్చాలు అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా బిఏంసి  కాంగ్రెస్ కార్పొరేటర్లు పెద్ద బావి సుదర్శన్ రెడ్డి, రాలగుడెం సంతోషి శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి అధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చి భారీ గజ మాల బహూకరించి, టపాసులు కాల్చి పారిజాత నర్సింహ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పారిజాత నర్సింహ రెడ్డి మాట్లాడుతూ.. నాపై అభిమానంతో పెద్ద మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు ఎత్తున తరలి వచ్చి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. మీ ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నర్సింహ రెడ్డి, తిరుపతి రెడ్డి, దయ రెడ్డి, సరికొండ బాల కృష్ణ గౌడ్, పలువురు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply