Take a fresh look at your lifestyle.

తెలుగుతనం ఉట్టిపడే నిండైన విగ్రహం..!: రోశయ్య మృతి పట్ల దేవులపల్లి అమర్‌ ‌సంతాపం

ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ ‌కొణిజేటి రోశయ్య మృతి పట్ల ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ ‌సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుతనం ఉట్టిపడే నిండైన విగ్రహం, రాజకీయ, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పలు బాధ్యతలు నిర్వహించారు.

శాసనసభలో  రోశయ్య చేసిన ప్రసంగాలు ఆలోచింప చేసే విధంగా ఉండేవి. ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్ర హోమ్‌ ‌శాఖ, ఆర్థిక శాఖ, పలు శాఖల మంత్రిగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ ‌వై ఎస్‌ ‌రాజశేఖర రెడ్డితో  రోశయ్య అనుబంధాన్ని అమర్‌ ‌గుర్తు చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ,  రోశయ్య కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని అమర్‌ ‌తెలిపారు.

Leave a Reply