ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలి కలెక్టర్ శ్వేతామహంతి
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం వివిధ ప్రాంతాల నుంచి 74 ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి ప్రజావాణిలో ధరఖాస్తులను స్వీకరించారు. ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను జిల్లా కలెక్టర్కు అందచేయడం తో తక్షణమే తమ సమస్యలు పరిష్కారించాలని పలువురు కోరారు. కలెక్టర్ శ్వేతామహంతి వచ్చిన ఫిర్యాదులను అధికారులు జాప్యం లేకుండా పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరారు. ముఖ్యంగా భూసమస్యలు నిరుద్యోగ సమస్యలు, ఫింఛన్ల పై ఎక్కువగా ఫిర్యాదులు తమ ఫిర్యాదులు ప్రజావాణిలో అందజేశారు.
పోలీస్ ప్రజావాణిలో10 ఫిర్యాదులు…
జిల్లాలోని పలు ప్రాంతాలనుండి 10 మంది ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు ఫిర్యాదుదారులనుండి స్వయంగా అడిగి తెలుసుకొని సంబంధిత పోలీస్ అధికారులకు ఫిర్యాదుదారల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదుల్లో భూతగాదాలు, భార్యాభర్తల తగాదాలు, ఇతర తగాదాలు వచ్చినట్లు తెలిపారు.
Tags: Complaints, should, resolved, without delay, Collector Swetha Mahan