Take a fresh look at your lifestyle.

నిజమైన సెక్యులర్ పరిపాలన సాగిస్తున్న సిఎం కెసిఆర్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25 : సిఎం కెసిఆర్ మత విశ్వాసాలను గౌరవించి, ఉద్యోగుల ఆద్యాత్మిక విలువలను పరిగణనలోకి తీసుకుని నిజమైన సెక్యులర్ ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తున్నారని అని క్రైస్తవ దర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షులు జెరుషలేం మత్తయ్య ప్రభుత్వాన్ని అభినందించారు. తెలంగాణ సెక్రటేరియట్ లో చర్చి ప్రారంభంపై క్రైసవ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ సందర్బంగా మత్తయ్య మాట్లాడుతూ మత సామరస్యం, మత సమానత్వం, భారత దేశ సెక్యులర్ సిద్దాంత అమలుకు నిదర్శనం అన్నారు. ఇది కేవలం క్రైసవులకు మాత్రమే కాకుండా ప్రజలందరికీ శుభ పరిణామం అన్నారు. ఈ సందర్భంగా చర్చి ప్రారంభం అనంతరం తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్, మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ లు విద్యుత్ శాఖ మాజీ ఉద్యోగి పాస్టర్ జాన్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ ఉద్యోగులు జిఎడి.చిట్టిబాబు, పి.ప్రభుదాస్, బిషప్ విల్సన్ సింగం, బిషప్ స్వామి దాస్, బిఆర్ఎస్ క్రైసవ నాయకులు శ్రావణ్ కుమార్, దయాకర్, ఇశ్రాయేల్ పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply