Take a fresh look at your lifestyle.

ఉప్పల్ బీఆర్ఎస్ కు భారీ జట్కాఉప్పల్లో  బి ఆర్  ఎస్ పార్టీ  నుండి  కాంగ్రెస్ లోకి భారీ చేరిక‌లు

  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 14:  ఆరు నూరైనా ఉప్ప‌ల్ లో ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి గెలుపును ఆప‌టం ఎవరి త‌రం కాద‌ని, యువ నాయ‌కుడు ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి గెలుపు కోసం  15రోజులు  రాత్రి పగలు క‌ష్ట‌ప‌డాలని  పిసిసి అధ్యక్షులు  రేవంత్ రెడ్డి  అన్నారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు. వారికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని డివిజ‌న్ల‌లో బీఆర్ఎస్ ఖాళీ అవుతోందనీ ఉప్పల్ కాంగ్రెస్ అభ్య‌ర్థి మందముల ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి అన్నారు. మంగళవారం  ఉప్పల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డికిమ‌ద్ధ‌తుగా అన్ని డివిజ‌న్ల నుండి బిఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరిక‌లు  జ‌రుగాయి.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో ఉప్పల్ నియోజకవర్గ సీనియ‌ర్ నేతలు, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అనుచరులు జ‌నంప‌ల్లి వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, గ‌రిక సుధాక‌ర్,  హ‌బ్సిగూడ  డివిజ‌న్ అధ్య‌క్షుడు  వ‌నంప‌ల్లి గోపాల్ రెడ్డి, హ‌బ్సిగూడ సీనియ‌ర్ లీడ‌ర్ కొండ‌ల్ రెడ్డి, ఉద్య‌మ‌కారుడు బండ వినేష్ రెడ్డి, వెలుగుట్ట గుడి చైర్మ‌న్ కొంగ‌ల శ్రీ‌ధ‌ర్, సీనియ‌ర్ నేత వంశ‌రాజ్, సీనియ‌ర్ నేత స‌ర్ఫ‌రాజ్, ఉద్య‌మ‌కారులు ఎరువ అశోక్, కొంగ‌ల న‌ర్సింహ‌, గ‌రిక ప్ర‌భాక‌ర్,  సీనియ‌ర్ నేత ఎం.డి యూసుఫ్, రామంతాపూర్ సీనియ‌ర్ నేత  శ్రీ‌ల‌త యాద‌వ్, హ‌బ్సిగూడ డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ధ‌న‌లక్ష్మి, హ‌బ్సిగూడ డివిజ‌న్ కార్య‌ద‌ర్శి భాగ్య‌రేఖ‌, చ‌ర్ల‌పల్లి యూత్ వింగ్ నుండి రాముతో  ప‌లువురు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరు నూరైనా ఉప్ప‌ల్ లో ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి గెలుపును ఆప‌టం ఎవరి త‌రం కాద‌ని, యువ నాయ‌కుడు ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి గెలుపు కోసం   15రోజులు క‌ష్ట‌ప‌డాల‌ని రేవంత్ రెడ్డి సుచించారు.

Leave a Reply