హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్13: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా(సిఎం సిపిఆర్ఓ) నియమితులైన బి.అయోధ్య రెడ్డి బుధవారం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సిఎం కార్యాలయంలో సీపీఆర్వోగా నియమించినందుకు అయోధ్య రెడ్డి కృత్ఞతలు తెలిపారు.