- తెలంగాణ అస్థిత్వాన్ని దేశానికి చాటింది కేసీఆర్
- కాంగ్రెస్ వాళ్ళవి చేతలు తక్కువ, కోతలు ఎక్కువ
- రూ.1360 కోట్ల అభివృద్ది పనులకు మంత్రి కేటిఆర్, పువ్వాడ అజయ్కుమార్ శంఖుస్థాపనలు
- తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చెప్పిన మహనీయుడు ఎన్టిఆర్ : ఖమ్మంలో ఎన్టిఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్
ఖమ్మం టౌన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : చరిత్ర ఎవరు రాసినా సత్యాలను ఎవరూ దాచలేరని, వాటిని చరిత్రనుండి చెరిపేయలేరని, తెలుగోడి సత్తాను దేశానికి పరిచయం చేసింది దివంగతన నేత ఎన్టిఆర్ అయితే తెలంగాణ అస్థిత్వాన్ని, పాలనా దక్షతను పరిచయం చేసింది సిఎం కెసిఆర్ అని రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఆరు దశాబ్దాలుగా ప్రజలను గోస పెట్టిన కాంగ్రెస్ పార్టీ వారెంటీ లేని గ్యారెంటీలను నమ్మి ఆగమవుదామా లేక కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ చేపడుతున్న ప్రగతి రథచక్రాను ముందుకు నడిపేందుకు అభివృద్ధిలో భాగమవుదామా అని తెలంగాణ ప్రజలే తేల్చుకోవాలని కోరారు. ఖమ్మం నగరం అన్ని రంగాల ప్రగతిలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇదివరకెన్నడు లేని విధంగా జిల్లాను రాష్ట్రంలోనే వ్యవసాయం, సాగు, త్రాగునీరు, ఐటి, పరిశ్రమలు, ఉపాధి కల్పన, రహదారులు, వైద్యం, ఆరోగ్యం, విద్య వంటి అన్ని రంగాలలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకే దక్కుతుందని మంత్రి కెటిఆర్ అన్నారు.
ఇదే సూర్తితో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. శనివారం ఖమ్మం నగరంలో 1360 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఉదయం 10.00 గంటలకు హెలీకాప్టర్ ద్వారా ఖమ్మం నగరానికి చేరుకున్న మంత్రి కెటిఆర్ తొలుత లకారం ట్యాంక్బండ్పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టిఆర్ పార్కును ప్రారంభించారు. అనంతరం రూ.10 కోట్లతో నగరంలో చేపట్టనున్న అండర్గ్రౌండ్ డ్క్రెనేజ్, మరో రూ.2.49 కోట్లతో అమృత్ 2.0 అండర్ గ్రౌండ్ డ్క్రెనేజ్ నిర్మాణం పనులకు శంఖుస్థాపనలు చేశారు.
అనంతరం నగరం 20వ డివిజన్ ఎస్బిఐటి ఇంజనీరింగ్ కళాశాల రోడ్దు వద్ద రూ.71 లక్షలతో స్పోర్టస్ పార్క్(టర్ఫ్కోర్టు), ప్రకాష్నగర్లో ప్రొఫెసర్ జయశంకర్ పార్క్లో 108.71 కోట్లతో నిర్మించిన అండర్గ్రౌండ్ డ్క్రెనేజ్ పైప్ల్కెన్, వర్షపు నీరు తరలించే పనులను, విడిఓస్ కాలనీ వద్ద రూ.8.54 లకోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం కాల్వ ఒడ్డు వద్ద రూ.690.52 కోట్లతో నిర్మించనున్న మున్నేరు ఆర్సిసి రక్షణ గోడల నిర్మాణ పనులకు, మున్నేరు వద్ద రూ.180 కోట్లతో నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు, గట్టయ్య సెంటర్ నగరపాలక సంస్థ నందు ఎల్ఆర్ఎస్ నిధులు రూ.20 కోట్లతో నిర్మించనున్న రోడ్ల పనులకు, ఇటివలే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు మంజూరు చేసిన టియుఎఫ్ఐడిసి నిధులు రూ.100 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలకు మంత్రులు శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ…తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఎంతో ఆప్తుడు విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ అవకాశం కల్పించిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తెలుగు వారి ఖ్యాతిని చాటిన మహానుబావుడు నందమూరి తారక రామారావుని, అటువంటి మహనీయుల స్థానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
అటువంటి హహనీయుడి పేరు తనకు ఉండడం చాలా సంతోషదాయకమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారధి రెడ్డి, శాసనమండలి సభ్యులు తాతా మధుసూదన్, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, పోలీసు కమీషనర్ విష్ణుయస్ వారియర్, జిల్లా పరిషత్ చ్కెర్మన్ లింగాల కమలరాజు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుఢా చ్కెర్మన్ బచ్చు విజయ్కుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటి చ్కెర్మన్ దొరెపల్లి శ్వేత, డి.సి.సిబి చ్కెర్మన్ కూరాకుల నాగభూషణం, డిసిఎంఎస్ రాయల శేషగిరిరావు, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్సింగ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.